హైదరాబాద్: నగరంలోని టోలిచౌకిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత టోలిచౌకిలో సయ్యద్ జిలాని అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు కిరాణ దుకాణంలో పనిచేస్తున్నాడని, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.