ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టుకు వరద ఉధృత్తి మళ్లీ పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉధృ తంగా ప్రవహిస్తుండడంతో శనివారం జూరాల రిజర్వాయర్కు 64వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో 4 గేట్లెత్తి స్పిల్వే ద్వారా 28,748 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాలు వకు 975 క్యూసెక్కులు, కుడి కాలువకు 972, సమాంతర కాలువకు 850, భీమా1కు 650, భీమా2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యు దుత్పత్తికి 65,594 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్కేంద్రాలలో విద్యు దుత్పత్తిని నిర్వ హిస్తున్నారు. ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 4.905 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు 205. 310 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.25 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 227.165 మి.యూ విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా 9,357 టీఎంసీల నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రాజెక్టు నుంచి 68,358 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతుండగా సెలవు దినం కావడంతో నేడు పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రాజక్టు ఎడమ వైపున అమరచింత పోలీ సులు గట్టి పహరా నిర్వహించనున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. సందర్శకులు వాహనాలతో డ్యామ్ పైకి రాకూడద ని, వాహనాలను డ్యామ్ సైట్లోనే నిలిపి రావాలని సూచించారు.