బన్సీలాల్పేట్, మే 19: జానియర్ల డాక్టర్ల సమస్యలు తెలుసునని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గాంధీ దవాఖాన జూడాల అధ్యక్షుడు మణికిరణ్రెడ్డి తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శించిన సందర్భంగా తమ సమస్యలపై వినతిపత్రం అందజేశామని చెప్పారు. త్వరలోనే జూడా ప్రతినిధులతో సమావేశమవుతానని తెలిపారని మణికిరణ్రెడ్డి పేర్కొన్నారు. ైస్టెపెండ్ను 2021 జనవరి నుంచి కాకుండా 2020 జనవరి నుంచి చెల్లించాలని, ఫైనల్ ఇయర్ పీజీ విద్యార్థులను సీనియర్ రెసిడెంట్స్గా పరిగణించాలని, కొవిడ్తో మరణించిన వైద్యులు, సిబ్బందికి తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వైద్యులు, వైద్యసిబ్బంది కొవిడ్ బారిన పడితే బీమా సదుపాయంతో నిమ్స్లో చికిత్స అందించాలని, గతంలో ప్రకటించిన 10% ఇన్సెంటివ్ను తక్షణమే అమలు చేయాలని, సీనియర్ రెసిడెంట్స్కు 15% వేతనాల పెంపును వెంటనే ఆమోదించాలని కోరినట్టు తెలిపారు. గత 17 ఏండ్లుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో తమను రెగ్యలరైజ్ చేయాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నర్సులు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తిచేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. డాక్టర్లు, నర్సుల సేవలు వెలకట్టలేనివని, తప్పకుండా నర్సుల సమస్యలపై చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.