హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): చనిపోయినవాళ్లను దేవుళ్లతో సమానం అం టారు. అందుకే వాళ్లకు గౌరవప్రదం గా అంత్యక్రియలు నిర్వహించ టం మన సంప్రదాయం. అం దుకోసం తెలంగాణ ప్రభు త్వం గ్రామానికో వైకుంఠధామాన్ని ఏర్పాటుచేయించిం ది. కులాలకు అతీతంగా అంతా ఒకే దగ్గర అంత్యక్రియలు చేసేలా శ్మశానవాటికల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో 12,728 వైకుంఠధామాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఇప్పటికే 12,386 (97.31 శాతం) పూర్తయ్యాయి. మిగిలినవి కూడా పూర్తికావొచ్చాయి. సంగారెడ్డి, జగిత్యాల, జనగామ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో వందశాతం వైకుంఠధామాలు పూర్తయ్యా యి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, వరంగల్ రూరల్ జిల్లాల్లో 99శాతం, మిగిలిన జిల్లాల్లో 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటన్నింటినీ ప్రస్తుత పల్లెప్రగతిలో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో వైకుంఠధామాన్ని రూ.12.60లక్షల వ్య యంతో నిర్మిస్తున్నారు. అదనపు ఏర్పాట్లు, ఇతర అవసరాలను, మరింత మెరుగైన సదుపాయాల కోసం గ్రామ పంచాయతీ నిధులను వాడుకొనేలా ప్ర భుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటికోసం ప్రభుత్వం రూ. 1,554.76 కోట్లు వెచ్చిస్తున్నది. అన్ని రకాల వసతులు ఉండేలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా వీటిని నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఫ్రీజర్లను, శవాలను తీసుకెళ్లే ప్రత్యేక వాహనాలను సమకూర్చారు.
పట్టణాల్లోనూ పెద్దఎత్తున వైకుంఠధామాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం 2021-22 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. పట్టణా ల్లో వైకుంఠ రథాలను కూడా కొనాలని నిర్ణయించారు. 141మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 1,333 శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో 236 వైకుంఠ ధామాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఊరిలో ఎవరన్నా చనిపోతే చెరువు గట్టుకో, వాగు పక్కనో కాల్చేవారు. భూములు ఉన్నవాళ్లు సొంత జాగాలో అంత్యక్రియలు నిర్వహిస్తే.. భూముల్లేని పేదలు, ఎస్సీలు, ఎస్టీలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కనీస సౌకర్యాలు లేకపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా తెలంగాణ సర్కారు చేపట్టిన వైకుంఠధామాలతో చివరిమజిలీ గౌరవప్రదంగా సాగుతున్నది.
గతంలో గ్రామంలో శ్మశానం లేక ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. పల్లెప్రగతిలో చేపట్టిన వైకుంఠదా మంతో ఆ బాధ తీరింది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్లు గ్రామానికే వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. స్నానాలు చేయటానికి రెండుబోర్లు వేయిం చాం. మా మండలంలో పూర్తయిన మొదటి వైకుంఠ దామం మాదే.
–విజయేందర్రెడ్డి, సర్పంచ్, గట్టు భూత్కూర్, కరీంనగర్ జిల్లా
గ్రామానికో వైకుంఠధామం ఉండాలనేది సీ ఎం ఉద్దేశం. ఒకేసారి అన్ని గ్రామాల్లో వైకుంఠదా మాలు నిర్మించటం దేశంలోనే తొలిసారి. గ్రామం లో అవసరమైన వసతుల్లో ఇది ఒకటి. వీటిల్లో అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటుచేశాం. దాదాపు అన్ని గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి.
–సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి