పెద్దపల్లి రూరల్, మే 29: గూడ్స్ రైలులోని ఆక్సిజన్ ట్యాంకర్లో మంటలు చెలరేగిన ఘటన పెద్దపల్లి జిల్లా చీకురాయి సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఆక్సిజన్ నింపుకొని వచ్చేందుకు ఖాళీ ట్యాంకర్లతో శనివారం హైదరాబాద్లోని సనత్నగర్ నుంచి గూడ్స్ బయలుదేరింది. పెద్దపల్లి మండలం చీకురాయి సమీపంలోని 38వ రైల్వే గేటు వద్దకు రాగానే భారీ శబ్దంతో బోగీల్లోని ఓ ట్యాంకర్ నుంచి మంటలు వచ్చాయి. గూడ్స్ చివరలో ఉన్న గార్డు సురేశ్ గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. రైలును నిలిపి బోగీల నుంచి ఇంజిన్ను వేరు చేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.