హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో రెవెన్యూ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ను స్థిరీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ కోరారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను ఆప్షన్ల మేరకు జిల్లాలకు కేటాయించాలని విన్నవించారు. రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అవి త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయంలో ముఖ్యనాయకులు అత్యవసర సమావేశం నిర్వహించి పలు సమస్యలపై చర్చించారు.