హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా విద్యార్థులంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులైతే బయటికెళ్లలేని పరిస్థితి. వీరికి ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు స్కూళ్లకు చేరాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఖమ్మంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ ఖమ్రొద్దీన్.. పిల్లల ఇంటికే వెళ్లి పాఠ్యపుస్తకాలను అందజేస్తున్నారు. ఇంట్లోనే ఉండి చదువుకోవాలని ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.