హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను శనివారం పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు సీజేఐని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సతరించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీరమణను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిచేపట్టడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. చారిత్రక నగరం వరంగల్ను సందర్శించాలని సీజేఐని ఆహ్వానించారు.