వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన తెలిపారు. 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతేకాకుండా నిరంతరంగా రామప్ప చారిత్రక ప్రాధాన్యం గురించి కేంద్రాన్ని గుర్తు చేసిన సీఎం కేసీఆర్ ప్రయత్నాలకు ఫలితం దక్కిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు పాపారావు, పాండురంగారావు, తదితరులు కూడా రామప్ప కు యునెస్కో గుర్తింపు కోసం ముమ్మరంగా కృషి చేశారని ఆయన తెలిపారు. 2013లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు మార్లు రామప్ప 800 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరినా లాభం లేకపోయిందన్నారు.
1213 సంవత్సరం నాటి రామప్ప చారిత్రక కట్టడాలకు ఎట్టకేలకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
విషాదం : రెండంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు మృతి
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు