మట్టి దిబ్బల్లో మహా ఆలయం!
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని ముదుగాల్ గ్రామ మట్టి దిబ్బల్లో మహాదేవ స్థానం ఆనవాళ్లు, తాళపత్ర గ్రంథాలు లభించినట్టు పర్యాటకశాఖ పరిశోధన అధికారి, ప్రముఖ కవి డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ తెలిపారు. లభించిన ఆధారాలను బట్టి గతంలో అక్కడ గ్రామం కూడా ఉండేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు అక్కడ ఆదిమానవులు తిరగాడినట్టు గ్రామస్థులు చెప్తున్నారని, తవ్వకాలు జరిపితే ప్రాచీన చరిత్ర బయటపడే వీలుందని అన్నారు. ఈ దేవస్థానం కాకతీయుల కాలంలో నిర్మించి ఉంటారని, ముస్లిం పాలకుల హయాంలో కాలగర్భంలో కలిసిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 12 ఆలయాలు, పలు తాళపత్ర గ్రంథాలను కనుగొన్నట్టు చెప్పారు. ఆలయ ఆనవాళ్లు లభ్యం కావడం తెలంగాణ పూర్వ వైభవానికి నిదర్శనమని చెప్పారు.