హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ జీవోల జారీపై శుక్ర వారం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ రోజు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు అభిప్రాయపడ్డారు. 2004 నవంబర్ 1 తర్వాత నియమితులైన సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్ వర్తింపజేసి తమ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్, చీటి భూపతి రావు పేర్కొన్నారు. ఇది తమకు శుభదినమని.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటామన్నారు. పీఆర్సీ జీవోల విడుదలపై టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందూరి రాజిరెడ్డి, మహ్మద్ అబ్దుల్లా హర్షంవ్యక్తంచేశారు.