హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ)/నల్లబెల్లి: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం నల్లబెల్లిలో తుదిశ్వాస విడిచారు.
సీఎం కేసీఆర్ సంతాపం
రాజిరెడ్డి మృతి చెందినట్టు తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పెద్ది సుదర్శన్రెడ్డిని ఫోన్లో పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ మాలోత్ కవిత తదితరులు సంతాపం తెలిపారు.