యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్యార్చనలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాల ను పట్టువస్ర్తాలు, స్వర్ణ అభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసి అర్చనలు చేపట్టారు.
లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన నారసింహహోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరు కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు వైభవంగా జరిపారు. సాయంత్రం నిత్యారాధనలు, అలంకార వెండి జోడుసేవలు, సహస్రనామార్చనలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి.
అమ్మవారికి కుంకు మార్చనలు నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ భవనంలో కొలువైన శివుడికి నిత్యారాధనలు శైవ సంప్ర దాయంగా జరిగాయి. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మంగా జరుపుకునే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు.