యాదాద్రి: యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరాలయంలో పురోహితులు సోమవారం పర మశివుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిపారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివుడ్ని కొలుస్తూ జరి గిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు.
ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో ఆలంకరణ చేశారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. యాదాద్రీ శుడి నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి.
బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండి జోడు సేవను అత్యంత వైభవంగా జరిపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిత్య కైంకర్యాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్య నారాయణస్వామి వ్రతాలలో భక్తులు పాల్గొని సామూహిక వ్రతమాచరించారు. పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. బాల శివాలయంలో విజయదశమి పురస్కరించుకుని శ్రీదేవి శరన్నవరాత్రోత్సవా లను పురోహితులు అత్యంత వైభవంగా చేపట్టారు. నాలుగో రోజు అమ్మవారికి కుంకుమార్చనతో పాటు విశేష పూజా పర్వాలు జరిపారు.