నిజామాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత ఆయన నిజామాబాద్లోని సొంత గ్రామం వేల్పూర్కు వెళుతున్నారు. మార్గమధ్యంలో ఆర్మూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బైక్ యాక్సిడెంట్ను గమనించారు.
వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన కాన్వాయ్ను నిలిపేసి, క్షతగాత్రుల దగ్గరికి వెళ్లి పరామర్శించారు. అక్కడి వారిని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల్లో చిన్న పాప ఉండడంతో ఆయన చలించిపోయారు.
వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆ చిన్నారి, ఆమె తల్లిదండ్రులను ఆర్మూర్లోని ప్రైవేట్ దవాఖానకు పంపించారు. సంబంధిత దవాఖాన డాక్టర్తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
పిల్లలతో చిట్టాపూర్ వెళుతున్న దంపతులు వెళుతున్న బైక్ను వెనుక నుంచి సమీప గ్రామ యువకుడు నడుపుతున్న మరో బైక్ ఢీకొట్టిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు మంత్రికి తెలిపారు.
ఆ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన యువకుడికి ప్రాథమిక చికిత్స అందించాలని అక్కడికి వచ్చిన పోలీసులను మంత్రి వేముల ఆదేశించారు.
ఇతర దేశాలకు అందుబాటులో కోవిన్ పోర్టల్: ప్రధాని మోదీ
స్పీకర్పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. 12 మందిపై ఏడాది వేటు
హక్కుల నేత స్టాన్ స్వామి మృతి
జమ్మూ వైమానిక స్థావరంపై ఆర్డీఎక్స్, నైట్రేట్తో డ్రోన్ల దాడి
రూ.37 లక్షల బైక్.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్
అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?
వ్యక్తిగత జీవితంపై వర్క్ ఫ్రం హోం ప్రభావం
ఏటీఎం కార్డు లేకుండా డబ్బు విత్డ్రా చేయాలా?
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
మన దగ్గరేమో వానలు.. ఢిల్లీ , అమెరికాలో భానుడి భగభగ.. కారణమేంది?
హైదరాబాద్లో బంగారం ధర రూ.44,300..!
అమెజాన్ హిట్ బిగ్ మిస్టేట్.. రూ.5,900లకే రూ.లక్షవిలువైన ఏసీ