రాజ్యాధికారం అంటే ఏంటి? అసలు.. ప్రవీణ్ కుమార్కు దాని మీద ఏమైనా అవగాహన ఉందా? అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. దళిత బంధు పథకం మీద టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన గాదరి కిషోర్.. ప్రవీణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఓయూలో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన ప్రవీణ్ కుమార్.. ఇవాళ రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నాడు. బీఎస్పీ సిద్ధాంతం ఏంటో ప్రవీణ్కుమార్కు తెలుసా? యూపీలో బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా బ్రాహ్మణుడు ఉన్నాడు. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రవీణ్కుమార్ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. మోదీకి భయపడే బీజేపీ గురించి మాట్లాడటం లేదు. సీఎం కేసీఆర్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోం. దళితులు బాగుపడటం ఇష్టం లేకనే దళిత బంధును వ్యతిరేకిస్తున్నావు. ప్రగతి భవన్కు సుస్థిరంగా వెళ్లేది కారు మాత్రమే. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ ఆలోచనలను ఆచరణలో పెట్టిన అధికారి మాత్రమే. అంబేద్కర్ విగ్రహాలు కాకుండా తన విగ్రహాలు పెట్టిన నాయకురాలు మాయావతి. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను పోలీసు కాల్పుల్లో చంపించిన కాంగ్రెస్. ఇప్పుడు అక్కడ సభ పెట్టి నాటకమాడుతోంది.. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
అలాగే.. హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు అమలు కోసం జీవో జారీ చేయడంతో పాటు.. 500 కోట్ల రూపాయలను విడుదల చేసిన సీఎం కేసీఆర్కు గాదరి కిషోర్.. ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి నల్గొండలో 12 స్థానాల్లో 11 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది.. . సీఎం కేసీఆర్ను విమర్శించడం కాదు.. ప్రవీణ్ కుమార్ ఏం చేసిండో చెప్పాలి. తెలంగాణలో ఉన్న ఒక్క పథకమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా? దళిత బంధుతో ప్రతిపక్షాలకు భయం మొదలైంది. రాష్ట్రంలో 1000 గురుకులాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే – ఎమ్మెల్యే సైదిరెడ్డి
బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఓ భాగం ప్రవీణ్ కుమార్.. . దళితులకు నష్టం కలిగే విధంగా ప్రవీణ్కుమార్ను బీజేపీ వాడుకుంటోంది – ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ప్రవీణ్ కుమార్ కలలు కలగానే మిగిలిపోతాయి. ప్రవీణ్ కుమార్ ఎజెండా ఏంటో చెప్పాలి. జేపీ, జేడీ మాదిరిగానే ప్రవీణ్ పరిస్థతి అవుతుంది – ఎమ్మెల్యే భాస్కర్ రావు