పల్లె ప్రగతిలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు : ( 2021 జనవరి – కలెక్టర్ల సమావేశం నోట్)
పల్లె ప్రగతిలో 540 మండలాల్లోని మొత్తం 12,765 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు (100 శాతం) ఇచ్చింది.
రాష్ట్రంలో 2601 రైతువేదికలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2580 రైతు వేదికల నిర్మాణం (99శాతం) పూర్తయింది.
పల్లె ప్రకృతివనాల ఏర్పాటు కోసం రాష్ట్రంలోని మొత్తం 19,470 ఆవాసాలకు గాను 19,027 ఆవాసాల్లో (98శాతం) భూములను గుర్తించడం జరిగింది. ఇందులో 18,656 పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించడం జరిగింది. 15,646 పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటడం జరిగింది.
పల్లె ప్రకృతి వనాల్లో 12 కోట్ల 67 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 13 కోట్ల 87 లక్షల మొక్కలను (109శాతం) నాటడం జరిగింది. 2020 డిసెంబర్ వరకు 10 కోట్ల 97 లక్షల మొక్కలను నాటగా, ఇందులో 9 కోట్ల 95 లక్షల మొక్కలు (91 శాతం) బతికాయి.
కల్లాల నిర్మాణం
కరంటు బిల్లులు :రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో 1,17,278 కరంటు బిల్లులకు సంబంధించి రూ.28 కోట్ల 49 లక్షలు చెల్లించడం జరిగింది.
15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు :2020 ఏప్రిల్ నుంచి జనవరి-2021 వరకు నెలకు రూ.308 కోట్ల చొప్పున రూ.3,079 కోట్లు ఇవ్వడం జరిగింది.
గ్రీన్ బడ్జెట్ : రాష్ట్రంలోని 540 మండలాల్లోని మొత్తం 12,769 గ్రామాలకు రూ.2,309.58 కోట్లు నిధులు ఇవ్వగా, ఇందులో రూ.230.96 కోట్ల గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించడం జరిగింది.
ఇంటింటికీ వెళ్లి సేకరించడం 79శాతం నుంచి 92శాతం వరకు పెరిగింది.
139 పట్టణ స్థానిక సంస్థల్లో కంపోస్టింగ్ జరుగుతున్నది
వీటిలో 187 పొడిచెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మున్సిపాలిటీల్లో 888 ఎకరాల్లో డంప్ సైట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
2020 ఫిబ్రవరి నుంచి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతున్నది.
డిసెంబర్ -2020 వరకు రూ.143 కోట్ల 48 లక్షలు చెల్లించడం జరిగింది.
నర్సరీలు : 142 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం వార్డులు: 3,618
10శాతం గ్రీన్ బడ్జెట్ :
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 17 లక్షల 14 వేల ఇండ్లలో, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 21 లక్షల 24 వేల ఇండ్లలో జ్వర సర్వే చేశారు. వీరందరికీ కరోనా మందుల పంపిణీ జరిగింది. 1 కోటి మందికి ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 సెంటర్ల ద్వారా 10 లక్షల మందికి భోజనం అందించారు. 224 బస్తీ దవాఖానాల ద్వారా రోగులకు సేవలందించడం జరుగుతుంది. బహిరంగ మల విసర్జన నిరోధానికి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో 14,657 మరుగుదొడ్లను నిర్వహిస్తున్నది. దీంతో పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగైంది. స్వర్గీయ పీవీ నర్సింహరావు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, వారి స్మారకార్థం నెక్లెస్ రోడ్ కు పీవీఎన్ఆర్ మార్గంగా నామకరణం చేశారు.