గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగిరింది. వరుసగా రెండోసారి వరంగల్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు ఓరుగల్లు ఓటర్లు. మొత్తం 66 డివిజన్లకు తాజాగా ఎన్నికలు జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. రాత్రి 7 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 43 డివిజన్లలో గెలిచింది. బీజేపీ 10 డివిజన్లలో, కాంగ్రెస్ – 3, ఇతరులు – 5 స్థానాల్లో గెలిచారు. మరో ఐదు డివిజన్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 43 స్థానాలకు గానూ 36 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 5 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు (రెబల్ ) , బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కో స్థానములో విజయం సాధించారు.
సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 32 వార్డుల్లో గెలిచారు. 17, 20, 28, 29, 35, 36, 37 వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులు ఉన్నాయి. ఇంకా 11 వార్డుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. మొదటి రౌండ్ లో 21 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. 19 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కో వార్డులో గెలుపొందారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఫలితం వెలువడింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందాడు. బీజేపీ అభ్యర్థి మందుగుల అఖిల్ గౌడ్ గెలుస్తాడని భావించినప్పటికీ, ఆ పార్టీకి షాక్ తగిలింది.
మున్సిపల్ ఉపఎన్నికల్లో కూడా గులాబీ గుబాలించింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారాం విజయం సాధించారు. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 12వ వార్డులో టీఆర్ఎస్ గెలుపొందింది. 12వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి నాయిని యాదగిరి 331 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 3, 4, 5, 12, 13, 15, 16, 17, 18 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది.
కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ టీఆర్ఎస్ 7 వార్డుల్లో, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందింది.
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. గులాబీ జెండా ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 43 వార్డులకు గానూ ఇప్పటి వరకు 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ పన్నెండు వార్డుల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు.
నకిరేకల్ మున్సిపాలిటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ 20 వార్డులకు గాను20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 11 టీఆర్ఎస్, 6 ఫార్వార్డ్ బ్లాక్, 2 కాంగ్రెస్, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ 18వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బెంజర్ గంగారాం విజయం
జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డులో ఫలితాలు వెల్లడి… 16 వార్డుల్లో టీఆర్ఎస్, రెండు చోట్ల బిజెపి, ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం. స్పష్టమైన ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ.
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాగా 1వ వార్డులో కందాల బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) గెలుపొందాడు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సుకన్య గెలుపొందింది. 8వ వార్డులో కందాల పావని శ్రీనివాస్ రెడ్డి(స్వతంత్ర) అభ్యర్థి గెలుపొందారు. నకిరేకల్ పురపాలికలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. తొలి రౌండ్లో 12, రెండో రౌండ్లో 8 వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జడ్చర్లలో టీఆర్ఎస్ హవా.. మూడు వార్డుల్లో గెలుపు
జడ్చర్ల మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 1, 13, 14 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు
నకిరేకల్ ఐదు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 13, 17, 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు
ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో కార్పొరేషన్లో ఆ పార్టీ ఇప్పటివరకు ఐదు స్థానాలను సొంతం చేసుకున్నది. ఇప్పటికే 10వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు
కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో టీఆర్ఎస్ విజయం
సిద్దిపేట పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు ఆధిక్యం. టీఆర్ఎస్-44, బీజేపీ-2, ఇతరులు-3
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డుల్లో టీఆర్ఎస్ జయకేతనం
జడ్చర్లలో కౌంటింగ్ ప్రక్రియనంతా వెబ్కాస్టింగ్ ద్వారా రికార్డు
జడ్చర్లలో 27 వార్డుల్లో మొత్తం 112 మంది, అచ్చంపేటలో 20 వార్డుల్లో 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జడ్చర్లలో 5 గదులు, 19 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 84 మంది సిబ్బంది, 9 మంది రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అచ్చంపేటలో ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బంది, ఏడుగురు రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియనంతా వెబ్కాస్టింగ్ ద్వారా రికార్డు చేస్తున్నారు.
సిద్దిపేట లో ప్రారంభమైన కౌంటింగ్
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్ఎస్కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపర
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపర ప్రారంభించింది. కార్పొరేషన్లోని 13వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీరజ గెలుపొందారు. ఖమ్మంలో మొత్తం 60 వార్డులు ఉండగా ఇప్పటికే పదో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. దీంతో అధికారపార్టీ 2 స్థానాలను సొంతంచేసుకుంది.