హైదరాబాద్: టూరిజం ప్లాజా (Tourism Plaza) లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మార్కెట్లోకి 23 విజయ ఉత్పత్తులను (Vijaya Products) విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..పంటల ఉత్పత్తుల్లో రసాయనాలు తగ్గించేందుకు రైతులను చైతన్యం చేయాలని అన్నారు. కల్తీ లేని ఉత్పత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వాలు నూనె గింజల ఉత్పత్తిని నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ ప్రభుత్వ కృషితో నూనె గింజల సాగు పెరిగింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. మిషన్ భగీరత పథకంతో ఇంటింటికి మంచి నీరు అందిస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ