హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని పవర్గ్రిడ్ కార్యాలయాల్లో జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. దీనిలో భాగంగానే గురువారం సికింద్రాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
హైదరాబాద్ సబ్ స్టేషన్లో పనిచేసిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్ లేబర్, సెక్యూర్టీ సిబ్బంది, డ్రైవర్లు, క్యాంటీన్ కార్మికులకు టీకాలు వేశారు. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ క్యాంపు జరిగింది.
సుమారు 154 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పవర్గ్రిడ్ టీకాలు వేయించింది. కోవిడ్19 నియంత్రణలో భాగంగా వారందరికీ ఎన్95 మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.