హైదరాబాద్: వృద్ధాప్యంతోపాటు కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేనేని సత్యనారాయణ.. అందరూ ముద్దుగా పిలుచుకునే ఎమ్మెస్సార్ కూడా ప్రత్యేక తెలంగాణ పిపాసే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా కేంద్రమైన కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) తరఫున తొలిసారి ఎన్నికయ్యారు.
అప్పటికే తొలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెస్సార్.. నాటి టీపీఎస్ వ్యవస్థాపకుడు మర్రి చెన్నారెడ్డితో కలిసి పని చేశారు. అందుకే 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలుత టీపీఎస్ నుంచి ఎమ్మెస్సార్ గెలుపొందారు. తర్వాత మర్రి చెన్నారెడ్డి ప్రజాతీర్పుకు ద్రోహం చేసి.. టీపీఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు.
ఆ తర్వాత అంటే దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, తిరిగి 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెస్సార్ ఇదే కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1984 తర్వాత 2004 వరకు ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో ఆయన పాత్ర కనిపించలేదు..
1999 ఎన్నికలకు ముందు ఉమ్ముడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలుపొందినా.. పార్టీ అధికారంలోకి రాలేదు. కానీ సీఎల్పీ నేతగా ఎన్నికైనందున వైఎస్.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెస్సార్ను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరు ఉన్న ఎమ్మెస్సార్.. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ తదితరులతోపాటు ప్రముఖ పాత్ర పోషించిన వారిలో ఒకరు. అంతే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించి.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే విమర్శలు కొని తెచ్చుకున్నారు.
2004 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన ఎమ్మెస్సార్.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కే కేశవరావు అత్యంత సన్నిహితులు. వీరిద్దరి మధ్య సంవాదం వల్లే 2006లో కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక వచ్చిందన్న విమర్శ ఉంది.
ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న తెలంగాణ నినాదం 2006 ఉప ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గెలుపునకు కారణమైంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెస్సార్ గెలుపొందినా మంత్రి పదవి దక్కలేదు. ఆర్టీసీ చైర్మన్గా నియమితులయ్యారు.
2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. నాటి నుంచి ఇటీవలి వరకు ఒకటి, రెండు సందర్బాల్లో మినహా ఎప్పుడు బహిరంగంగా ఆయన ప్రజల ముంగిట్లోకి రాలేదు.
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మెగాస్టార్
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
కొవిడ్-19 కలకలం : భారత్ ఎకానమీపై అమెరికన్ చాంబర్ హెచ్చరిక!