ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో 7 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా స్థిరంగా కొనసాగుతున్న ఇన్ఫ్లో ఒక్కసారిగా పెరగడంతో జూరాల గేట్లెత్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు క్రమంగా వరద పెరగడంతో జూరాలకు 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుకుంటుంది.
7 గేట్ల ద్వారా 29,210 క్యూసెక్కుల నీటిని దిగువ కు వదులుతున్నారు. ఆయకట్టు, త్రాగునీటి పథకాల కోసం నెట్టెం పాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 773, సమాంతర కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యుతుత్పత్తికి 44,468 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లోని 12యూనిట్లలో విద్యుతుత్పత్తిని నిర్వహిస్తున్నారు. ఎగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4,914 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు మొత్తంగా 247.275 మి.యూ ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.80 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 272.678 మి.యూ విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎం సీలు కాగా మంగళవారం సాయంత్రానికి 9.480 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి 76,288 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతుంది.