ఇటిక్యాల: బీచుపల్లి క్షేత్రములోని లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్పవాలను నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు వివిధ రూపాలలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుందన్నారు. 12 వ తేది విద్యాలక్ష్మి అవతారం రోజున అమ్మవారి చెంత సామూహిక అక్షరా భ్యాసం ఉంటుందన్నారు.