బొడ్రాయిబజార్: దళితులపై బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా కపట ప్రేమను ఒలకబోస్తు న్నారని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి అన్నారు. శుక్రవారం స్థానిక కేవీపీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేస్తున్న ఆశీర్వాద యాత్ర సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చింతలచెరువులో దళితవాడలోని పారిశుధ్య కార్మికురాలు మెరుగు మారతమ్మ ఇంటికి వచ్చి అల్పా హరం చేయడం బీజేపీ దళితులకు చేస్తున్న అన్యాయాలను కప్పిపుచ్చుకోవడానికే అన్నారు.
పారిశుధ్య కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో కరోనా వారియర్ అవార్డు పొందిన కార్మికురాలు ఇంటికి వెళ్లి ప్రభుత్వం వైపు నుంచి వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కనీస ప్రకటన చేయకపోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అమానుషాలు పెరిగాయని అన్నారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కుల వివక్ష, అంటరాని తనం నిర్మూలన కోసం చేసిన చట్టాలను అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు కావడం లేదో జవాబు చెప్పాలన్నారు.
అట్రాసిటీ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని కేంద్రం చట్ట సవరణ చేయడం దుర్మార్గమన్నారు. నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి దళితులపై జరుగు తున్న దాడులను అరికట్టాలన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా దళితులను ఏకం చేసి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు జె.నరసింహరావు, బత్తుల వెంకన్న, కొండేటి ఉపేందర్, జై పాల్గొన్నారు.