హైదరాబాద్: కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉన్నా.. సొంతిండ్ల కొనుగోళ్లలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. దీనికి వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరుగడమే కారణం. విపత్కర పరిస్థితుల్లో ఉన్నా.. హైదరాబాద్లో రియాల్టీ రంగం ముందుకెళుతున్నది.
ఈ క్రమంలో వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించాలని ‘ది కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయి)’ హైదరాబాద్ శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు 2021-23 మధ్య క్రెడాయి హైదరాబాద్ మేనేజ్మెంట్ కమిటీని గురువారం ఎన్నుకున్నారు. ఈ కమిటీ హైదరాబాద్ రీజియన్ పరిధిలో రియాల్టీ రంగ డెవలప్మెంట్, మద్దతు కోసం చర్యలు తీసుకుంటుంది.
క్రెడాయి హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడిగా పీ రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా వీ రాజశేఖర్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జీ ఆనంద్ రెడ్డి, కచ్చం రాజేశ్వర్, ఎన్ జయదీప్ రెడ్డి, బీ జగన్నాథ్ రెడ్డి, ఆదిత్య గౌర కోశాధికారిగా, సంయుక్త కార్యదర్శులుగా శివరాజ్ ఠాకూర్, కే రాంబాబు ఎన్నికయ్యారు.
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు