కాచిగూడ పోలీస్స్టేషన్ (Kachiguda PS) నూతన భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి (DGP MahenderReddy) మాట్లాడుతూ..కాచిగూడ పోలీస్ స్టేషన్ నూతన భవనం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ (CMKCR) ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6.5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.