ఉప్పునుంతల: మండల పరిధిలోని హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి అలు గు పారుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్ట్లోకి భారీగా నీరు చేరు తుండడంతో అలుగు పారుతున్నది. దీంతో ప్రాజెక్ట్ జల కళను సంతరించుకుంది.
ప్రాజెక్టును చూడటానికి వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తిలకించడానికి తరలివస్తున్నారు. ముఖ్యంగా శని వారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో హైద్రాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రాజెక్ట్ వద్ద ఆగి అక్కడి సుందర దృశ్యాలను అస్వాదిస్తుండడంతో ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. అలుగు వద్ద ప్రమాదాలు జరిగే అవకాశo ఉండడంతో అక్కడ పొలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.