మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఎ5 ను గత నెల చైనా మార్కెట్లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ను ఇవాళ భారత మార్కెట్లో ఒప్పో విడుదల చేసింది. రూ.14,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
ఒప్పో ఎ5 ఫీచర్లు...
6.2 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.