సూర్యాపేట : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన ఆహారభద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను అందిస్తామన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరి అండదండలు ఎల్లవేళలా ఉండాలన్నారు.
అదేవిధంగా వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 2,50,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విజయలక్ష్మి, ఆర్డీవో కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుంకర అజయ్ కుమార్, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల, ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోగారు రమేష్, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మార్వో కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం