నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లు అన్నారు. గురువారం మండల పరిధిలోని వర్ధమానుకోట, ఈటూరు గ్రామాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీకా వేసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశు భ్రతను పాటించాలన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2కోట్ల మందికి వ్యాక్సీనేషన్ పూర్తి చేశామన్నారు. అనంతరం సబ్ సెంటర్లోని కంప్యూటర్ గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, ఎంపీపీ కూరం మణివెంకన్న, వైస్ ఎంపీపీ మణిమాల, ఎంపీడీవో గాలి శోభారాణి, డిప్యూటీ డీఎం హెచ్వో హర్షవర్ధన్, డాక్టర్లు మురళీ కృష్ణ, ప్రశాంత్, సుదర్శన్, ఎఎన్ఎం కళమ్మ, యల్లమ్మ, పీహెచ్ఎన్ ధనమ్మ, సర్పంచ్లు బోయిని శోభా లింగమల్లు, పేరాల సరిత , ఎంపీటీసీ వడ్డె పరశురాములు, ఈరేటి స్వప్న అంజయ్య, మండలాధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, గుండగాని అంబయ్య తదితరులు పాల్గొన్నారు.