నల్లగొండ : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం మాధవరం శివారులో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతులను కోదాడ పట్టణానికి చెందిన ఫ్రాన్సిస్, ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.