సూర్యాపేట: జిల్లాలోని నూతన్కల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగంపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. గ్రామంలోని పొలంలో మిరపకాయలు ఏరుతుండగా కూలీల సమీపంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి