సూర్యాపేట: జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ (45)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. వ్యక్తిగత కక్షలతోనే హత్యజరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.