మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కల్యాణతంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.