బొడ్రాయిబజార్: సూర్యాపేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్లో పొందుపర్చిన 40 అంజెండా అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. పట్టణంలోని 48 వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ 854.00లక్షలు, సద్దుల చెరువు కట్టపై పైలాన్ ఏర్పాటుకు రూ. 49 లక్షలు, సద్దుల చెరువు కట్ట పక్కన పార్క్ అభి వృద్ధికి రూ. 50లక్షలు, 5, 12, 13 వార్డుల్లో వైకుంఠధామాల అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తమ వార్డుల్లో నిధులు తక్కువ పెట్టారని బైఠాయించగా చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ మ్మ మాట్లాడుతూ రోడ్లు, మురికి కాలువలు ఉన్న ప్రాంతాల్లో మరలా మురికి కాలువల నిర్మాణం చేయడం సాధ్యం కాద ని అందుకే నిధులు కేటాయించలేదన్నారు. నిజంగా పని ఉన్న వార్డుల్లో నిధులు కేటాయించామని సమాధానం చెప్పా రు. సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ వార్డుల్లో నిజంగా అభివృద్ధి పనులు ఉంటే పరిశీలించి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.
పట్టణాభివృద్ది కోసం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అభివృద్ధికి మనమంతా సహకరించాల న్నారు. పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ వీలున్నంత వరకు నెల వారీగా సమావేశాలు పెట్టి సమ స్యలు పరిష్కరించుకోవాలన్నారు. అభివృద్ధిలో అన్ని వార్డులకు సమాన ప్రాతి నిధ్యం ఇవ్వాలన్నారు. ఇటీవల పార్లమెం ట్ సమావేశాల సందర్భంగా నరేంద్రమోడీని కలవడం జరిగిందని త్వరలో బొంబాయి నుంచి హైద్రాబాద్ వరకు బుల్లెట్ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నారని దానిని హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకి పొడిగించాలని కోరడం జరిగిందన్నారు.
అనంతరం జీరో అవర్లో కౌన్సిలర్లు వారి వారి వార్డుల సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమీషనర్ పి.రామాంజులరెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.