సూర్యాపేట: చిన్నారుల్లో పోషణ లోపం లేకుండా ఉండేందుకు ఆరోగ్య భారత్ – ఆరోగ్య తెలంగాణ అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ్ అభియాన్ పథకం పక్కాగా అమలు చేస్తున్నదని జాతీయ న్యూట్రిషన్ మిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జాన్సన్ అన్నారు. పోషణ్ మాసంలో భాగంగా సోమవారం జిల్లాలో పథకం అమలు తీరును పరిశీలించేందుకు జాతీయ న్యూట్రిషన్ మిషన్ ప్రతినిధులు పర్యటించారు.
ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి అక్కడ చిన్నా రులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 4వ రాష్ట్రీయ పోషన్ మహ్లో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ, పెరటి తోట పెంపకం, యోగ మెలుకవలు, రక్తహీనత లోపం వంటి ఈ నాలుగు అంశా లపై ప్రత్యేక దృష్టి సారించి చిన్నారుల తల్లిలలో, గర్భణుల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందన్నారు. పోషణ లోపం తో బాధ పడేవారిని గుర్తించి అదనపు పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య శాఖ వారి సమన్వయంతో ఎన్ఆర్సీకి సిఫార్సు చేసి వారికి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టీ- సాట్ వినియోగించుకోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన ఏడీ జైరామ్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ప్రతినిధులు రాహుల్సాధు, సీడీపీవో కిరణ్మయి, పోషన్ అభియాన్ జిల్లా కో- ఆర్టినేటర్ సంపత్ పాల్గొన్నారు.