సూర్యాపేట టౌన్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏడేండ్లుగా కోట్లాది రూపాయలతో అన్ని రంగాల అభివృధ్ధితో పాటు పురాతన దేవాలయాలకు సైతం పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఎడారిగా మారిన భూములను పచ్చద నంతో నింపి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుకుం టున్నామని.. ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పెర్కొన్నారు.
ఈ నెల 27న జరుగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలో చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ లక్ష్మీ నరసిం హా స్వామి దేవాలయంలో ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్న ఉండ్రుగొండ ఏడేండ్లుగా దినదినాభి వృద్ధి చెందుతున్నదన్నారు. ఇప్పటికే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్ధం కింది నుంచి దేవాలయం వరకు ఘాట్ రోడ్డు, సీసీ నిర్మాణం పూర్తయిందన్నారు. అలాగే కామన్ టాయిలె ట్లు పూర్తయ్యాయని.. మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉందన్నారు. కోనేరు రివిట్మెంట్ సైతం ప్రారంభమైందన్నారు. అంతే కాకుండా మిషన్ భగీ రథ ఫ్లాంట్ పడమటి ఉండ్రుగొండ గుట్టలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ వేస్ట్ వాటర్ను గిరిదుర్గంలోకి వదలి పచ్చదనాన్ని ఏడాది పొడవునా కాపాడే విధం గా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ఉండ్రుగొండ రూపురేఖలు మారాయన్నారు. చక్కటి పర్యాటక కేంద్రంగా నేడు దర్శనమిస్తుందన్నారు. అలాగే పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఉండ్రుగొండ చరిత్రపై పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని విజేతలకు ఈ నెల 27న జరుగనున్న పర్యాటక దినోత్సవ సభలో బహుమతుల ప్రధానోత్సవం ఉం టుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జూలకంటి జీవన్ రెడ్డి, కౌన్సిలర్ భాషా, నిర్వాహకులు డాక్టర్ రమేశ్ చంద్ర, డాక్టర్ విద్యాసాగర్, నాగరాజు, వినోద్ కుమార్, శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.