బొడ్రాయిబజార్, జూన్ 20 : జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పలు వార్డుల్లో కుక్కల బెడద తీవ్రమవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రిళ్లు ఒంటరిగా, వాహనాలపై వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నాయి. కొత్తవారి మాట అలా ఉంచితే కాలనీ వారు వచ్చినా తరుముతూ కరుస్తున్నాయి. ఇక కొత్తవారి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఒక్కసారి గుంపుగా చేరి కాటు వేస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కొందరు యజమానులు రాత్రివేళల్లో పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేయడంతో అవి కనబడిన ప్రతి ఒక్కరిపై దాడికి దిగుతున్నాయి. కుమ్మరి బజార్, ఎంజీరోడ్డు, రాజీవ్నగర్, బాలాజీనగర్లో వాహనదారులపై దాడిచేసి కరుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుక్కలు కరవడంతో చికిత్స పొందుతున్నారు. అధికారులు తక్షణమే కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కుక్కల సంతతి నివారణకు చర్యలు
కుక్కలను చంపేందుకు మాకు ఎలాంటి అధికారం లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. సూర్యాపేట ము న్సిపాలిటీ ఆధ్వర్యంలో కుక్కల కోసం జిల్లా కేంద్రంలోని జమునానగర్లో నూతనంగా ఓ షెడ్డును నిర్మిస్తున్నాం. ఈ షెడ్డులో వాటి సంతతి నియంత్రణకు ఆపరేషన్ చేస్తాం. దీంతో కుక్కల సంతతిని నివారించవచ్చు.
-పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట