సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 10 : రైతుల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు. మం డలంలోని ఇమాంపేట, దాసాయిగూడెం, ఎండ్లపల్లి, రామారం, కుప్పిరెడ్డిగూడెం, గాంధీనగర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం ప్రారంభించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సీఈఓ వాసు, సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, నాయకులు సునీల్రెడ్డి, పుల్లారెడ్డి, లింగానాయక్, ప్రేమ్, శ్యామ్, శ్రీనివాస్రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.
నూతనకల్ : మండలంలోని ఎర్రపహాడ్, దిర్శనపల్లి, పెదనెమిల, లింగంపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోహన్రావు, సర్పంచ్ గోరుగంటి ఉషారామకిషన్, నాయకులు పాల్గొన్నారు.
నాగారం: మండలంలోని వర్ధమానుకోట ఆవాసం పాటిమీదిగూడెంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎంపీపీ కూరం మణివెంకన్న ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయిని శోభాలింగమల్లు, ఎంపీటీసీ ఈరేటి స్వప్నఅంజయ్య, ఏపీఎం నగేశ్, డైరెక్టర్ కోట సోమలింగం, కడెం పరమేశ్వర్, మంజుల, పూలమ్మ పాల్గొన్నారు.
చివ్వెంల : మండలంలోని ఐలాపురం, రోళ్ల బండ తండా, బీబీగూడెం, మున్యానాయక్ తండా, వాల్యాతండా, వీకే పహాడ్, బద్యాతండా, మొగ్గయ్యగూడెం, తిమ్మాపురం తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు ప్రారంభించారు. మార్కెట్ డైరెక్టర్ ఉట్కూరి సైదులు, ఏఈఓలు సాయిప్రసాద్, పవన్, వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పెన్పహాడ్ : మండలంలోని చీదెళ్ల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, నాగులపాటి అన్నారంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ డీఎల్సీజీ బానోతు కృష్ణ, మానిటరింగ్ అధికారి పాశ్చ్యానాయక్, సీఈఓ సోమ్లా, గుర్రం అమృతారెడ్డి, గోపి, సొంటి శ్రీను, మహింద్ర రాజు, ప్రమీల, జూలకంటి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.