బొడ్రాయిబజార్: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత హింస, అశాంతి రోజురోజుకు పెరుగుతున్నదని దానికి ప్రధాన కారణం మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్లే అని భారత ప్రజాతంత్య్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ప్రధాన కార్య దర్శి మరియం దావలే అన్నారు. మూడు రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐద్వా మూడో రాష్ట్ర మహా సభల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న మనువాద, హిందుత్వ విధానాల మూలంగా దేశ ఐక్యతకు భంగం కలుగుతు న్నదన్నారు. బీజేపీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడం వల్ల ధరలు అడ్డూ అదుపు లేకుండా రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వంట గ్యాస్ 550 రూపాయల నుంచి నేడు వెయ్యి రూపాయలకు పెరిగిందన్నారు. 100 రూపాయలున్న మంచినూనె నేడు 190 రూపాయలైందని దీంతో దేశ ప్రజలపై భారం పడు తుందన్నారు. దేశానికి సంపదను సృష్టించే పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ బడా కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నదని ఆ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.
పార్లమెంట్లో మందబలంతో రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు ఆమోదించుకుని రైతాంగం, కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పది నెలలుగా రైతులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు నిర్వహించే దేశవ్యాప్త భారత్బంద్కు ఐద్వా పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
అనంతరం నిర్వహించిన సభలో పలు తీర్మాణాలు చేసి ఆమోదించారు. సమావేశంలో అఖిల భారత ప్రజాతంత్య్ర మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంపాల స్వరాజ్యం, మేకనబోయిన సైదమ్మ, జిల్లా నాయకులు మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
ఐద్వా రాష్ట్ర నూతన కమిటీ అధ్యక్షురాలిగా అరుణజ్యోతి, ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి, కోశాధికారిగా రత్నమాల, ఉపాధ్యక్షులుగా టి.జ్యోతి, బి.హైమావతి, ఆశలత, బుగ్గవీటి సరళ, సమీనా, అఫ్రోజ్, అహల్య, ఎన్.లక్ష్మమ్మ, జ్యోతి, శాంతకుమారి, సహాయ కార్యదర్ధులుగా మహేశ్వరి, నాగలక్ష్మి, ప్రభావతి, భారతి, లత, ఇందిరా, వినోద, గీత, అనురాధ లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా మాచర్ల భారతి, పద్మ, సరళ, మెరుగు రమణ, నాగ సులోచన, పయ్యావుల ప్రబావతి, వరలక్ష్మి, సరోజ, జానకమ్మ, కొండ అనురాధ, నిమ్మ పద్మ, వినోద, సృజన, లక్ష్మిదేవి, మంగ, నాగలక్ష్మి, పద్మ, విమల, ఎండి.షబీనాబేగం, శశికళ, లక్ష్మమ్మ, స్వరూ ప, జ్యోతి, రాజమ్మలతో మరి కొందరిని ఎన్నుకున్నారు.