కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నాగారం, మే 26 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సిబ్బందికి సూచించారు. నాగారం బంగ్లాలో నిర్వహిస్తున్న సర్వేను బుధవారం పరిశీలించి పాజిటివ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందన్నారు. లక్షణాలున్న వారికి వెంటనే మందులు ఇవ్వాలని, లక్షణాలు ఎక్కువ ఉండి ఆరోగ్యం మెరుగుపడకపోతే దవాఖానలో చేర్పించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ కమలాద్రి, నాగారం బంగ్లా సర్పంచ్ కుంబం కరుణాకర్, డాక్టర్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శోభన్, ఆర్ఐ వహీద్, ధనమ్మ పాల్గొన్నారు.
అండగా ఉండాలి
తిరుమలగిరి : వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కరోనా పేషెంట్లకు అండగా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. మండల కేంద్రంలో జ్వర సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. కరోనా పాజిటివ్ ఉన్న వారికి మెడికల్ కిట్ అందజేసి హోం ఐసొలేషన్లో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ధాన్యం నిల్వ చేస్తున్న కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ సంతోష్కిరణ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందిస్తున్న
ప్రభుత్వం: ఏంపీపీ, జడ్పీటీసీ
చివ్వెంల : కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తున్నదని ఏంపీపీ ధరావత్ కుమారి బాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్ అన్నారు. మండలంలోని జగన్తండాలో జ్వర సర్వేను పరిశీలించి మాట్లాడారు. కరోనా సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డబుల్ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మండల కేంద్రంలో గురువారం రెండు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్వేలో కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందించారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సర్పంచ్ ధరావత్ జ్యోతి భర్త రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ జమలారెడ్డి, మండల వైద్యాధికారి రాజ్కుమార్, ఎంపీఓ గోపి, హెల్త్ సూపర్వైజర్ శిరోమణి, పంచాయతీ కార్యదర్శి పవన్ పాల్గొన్నారు.
మఠంపల్లి : మండల వ్యాప్తంగా 29గ్రామ పంచాయతీల్లో జ్వర సర్వే కొనసాగుతుందని వైద్యాధికారి ఫిరోజ్ తెలిపారు. 30బృందాలు 300 కుటుంబాలను సర్వే చేయగా.. 29మంది కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మందుల కిట్లు అందజేసినట్లు తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.