నల్లగొండ రూరల్, ఏప్రిల్ 26 : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 30న జరుగనున్న 26వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ సామగ్రిని మున్సిపల్ అధికారులు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నుంచి పోలింగ్ కోసం అవసరమైన మెటీరియల్ రావడంతో అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకునున్నట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర తెలిపారు. 26వ వార్డు ఓటర్లంతా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ కిరణ్ కుమార్, అధికారులు యోగేశ్ పాల్గొన్నారు.