అనంతగిరి, జూన్ 24 : రైతు వేదికలతో వ్యవసాయ రంగం మరింత పటిష్టం కానున్నదని, ఏరువాక పున్నమి రోజున రైతు వేదికలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు మండలంలోని త్రిపురవరం, లక్కవరం గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి లాభాలు ఆర్జించాలని సూచించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని రైతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణీ పుల్లారెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కొణతం ఉమాశ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఈదుల కృష్ణయ్య, ఆయా గ్రామాల సర్పంచులు వేనేపల్లి వెంకటేశ్వర్రావు, మందడి వీరమ్మారంగారెడ్డి, భూపతి, ఎంపీడీఓ శ్రీనివాస్, వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కోదాడ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కోదాడ : కోదాడ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో విశ్రాంత భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక హంగులతో నూతన మార్కెట్ను రూ.8 కోట్లతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్, సెక్రటరీ కృష్ణయ్య, డైరెక్టర్లు ఓరుగంటి బ్రహ్మం, సత్యనారాయణ, శ్రీనివాస్రావు, శ్రీనివాస్, నాగేశ్వర్రావు, వైవీ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.