సూర్యాపేట : జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్ అమలు, యాసంగి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడారు. సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, మందులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిల్లా రాష్ట్ర సరిహద్దులో ఉండడం వల్ల కట్టుదిట్టుమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని ముఖ్యమత్రి తెలిపారు. కరోనా బాధితులకు నిరంతరం సేవలు అందుతున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 80శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కొనుగోళ్లు పూర్తయినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దండ మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.