సూర్యాపేట రూరల్, మే 20 : మండలంలోని కాసరబాద ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది దవాఖానకు వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో 14 మంది సిబ్బంది ఉండాలని, కరోనా సమయంలో 5 గంటల వరకు దవాఖానలో పని చేయాలన్నారు. దవాఖానలో ముగ్గురు మాత్రమే సిబ్బంది ఉన్నారని, రిజిస్టర్లో మాత్రం 14 మంది సంతకాలు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రిజిస్టర్ను తనిఖీ చేశారు.
కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపాలి : ఎంపీపీ భిక్షం
పెన్పహాడ్ : గ్రామాల్లో బారిన పడిన బాధితులకు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అండగా నిలబడి వారిలో మనోధైర్యం నింపాలని ఎంపీపీ నెమ్మాది భిక్షం సూచించారు. మండల పీహెచ్సీని ఆయన సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో భక్తళాపురంలో ప్రారంభమయ్యే ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు.. వాటి సేవలు ఎలా నిర్వహించాలనే విషయంపై వైద్యాధికారులు ప్రదీప్తికుమార్, మణిదీప్తో మాట్లాడారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఓలు చంద్రశేఖర్రాజు, భువనేశ్వర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.