గరిడేపల్లి, జూన్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో ఏడో విడుత హరితహారంపై జడ్పీటీసీ పోరెడ్డి శైలజారవీందర్రెడ్డితో కలిసి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నూతనంగా మొక్కలు నాటడం, గతంలో నాటిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టడం తదితర పనులు చేయాలన్నారు. పనుల్లో అలసత్వం తగదని హెచ్చరించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య, ఇన్చార్జి ఏపీఓ మహేశ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
హరితహారం లక్ష్యాన్ని సాధించాలి
చిలుకూరు : హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ బండ్ల ప్రశాంతి అన్నారు. శుక్రవారం మండలంలోని చెన్నారిగూడెం గ్రామ నర్సరీని ఆమె పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ ముక్కపాటి నరసింహారావు, సర్పంచ్ కొండల్, కార్యదర్శి పూల శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.
చింతలపాలెం : హరితహారం విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని ఎంపీపీ కొత్తమద్ది వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపురం, కొత్తగూడెం పంచాయతీల్లో హరితహారం నిర్వహణకు స్థలాలను పరిశీలించారు. ఎంపీడీఓ గ్యామానాయక్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రావు, ఎఫ్బీఓ శ్రీనివాస్, ఏపీఓ రవి, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మఠంపల్లి : మట్టపల్లిలోని నర్సరీలను ఎంపీడీఓ జానకీరాములు, ఎంపీఓ నరేశ్ శుక్రవారం పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఏడో విడుత హరితహారంలో 5.60లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి : ఏపీడీ
చిలుకూరు : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఏపీడీ డాక్టర్ పెంటయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలో చేపట్టనున్న ఏడో విడుత హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ నరసింహారావు, బాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.