తిరుమలగిరి, జూన్ 18 : ఏడో విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఎంపీపీ స్నేహలత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు గుంతలు తీయించాలని సూచించారు. అదే విధంగా పల్లె ప్రగతి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఉమేశ్చారి, ఎంపీఓ మారయ్య తదితరులు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
చివ్వెంల : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్ అన్నారు. ఏడో విడుత హరితహారంపై ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మండలంలో 4.5 లక్షలు మొక్కలు నాటి లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేసేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు తమవంతు కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేయనున్న ఆకస్మిక తనిఖీలో చివ్వెంల మండలం కూడా ఉన్నదని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వెంటనే కొత్తవి నాటాలన్నారు. వర్షాలు పడిన మరుసటి రోజు నుంచే మెక్కలు నాటాలన్నారు. జూలై 15 లోపు మెక్కలు నాటి ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమా వేశంలో తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ గోపి, ఏపీఓ నాగయ్య, అటవీ శాఖ సెక్షన్ అధికారి రాజేందర్ నాయక్, మండల వ్యవసాయాధికారి ఆశాకుమారి,సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.