సూర్యాపేటటౌన్, జూన్ 17 : కొవిడ్ కష్ట కాలంలో పని చేస్తున్న ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. స్థానిక రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు గురువారం పీపీఈ కిట్లతో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండాన్ సుదర్శన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో వారికి రక్షణగా ఉండేందుకు యూనియన్ సూచనల మేరకు ప్రభుత్వం మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. డీఐఓ పెండెం వెంకటరమణ, డాక్టర్ మురళీకృష్ణ, భాస్కర్రాజు పాల్గొన్నారు.
10,723 మందికి వ్యాక్సిన్
నేరేడుచర్ల : మండలంలో గురువారం వరకు నేరేడుచర్ల, పాలకవీడు ఉమ్మడి మండలంలో 10,723 మందికి కొవిడ్ టీకా, 32,719 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు నేరేడుచర్ల, పెంచికల్దిన్నె వైద్యాధికారులు నాగయ్య, హరికిషన్ తెలిపారు. నేరేడుచర్ల పీహెచ్సీలో 7,693 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయగా 18,924 మందికి పరీక్షలు నిర్వహించారు. పెంచికల్దిన్నె పీహెచ్సీలో 3,030 మందికి వ్యాక్సిన్ వేయగా 13,795 మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యాధికారులు చెప్పారు
తుమ్మలపల్లిలో ఐదుగురికి పాజిటివ్
మోతె : మండలంలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరంలో 57 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యా ధికారి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వాసంశెట్టి రమేశ్, వైద్య సిబ్బంది విష్ణు, విజయలక్ష్మి, ఆశ కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.
ఆర్థిక సాయం
అనంతగిరి : కొత్త గోల్తండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బానోత్ వస్త్రం కుటు ంబ సభ్యులకు కరోనా సోకడంతో ఆ పార్టీ నాయకుడు బుర్ర పుల్లారెడ్డి గురువారం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అందించిన నగదును వస్త్రం కుటుంబానికి అందించినట్లు తెలిపారు. ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, సర్పంచ్ శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
గరిడేపల్లి : కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని వెంకట్రామాపురం సర్పంచ్ గాలి రామకృష్ణ అన్నారు. గురువారం గ్రామంలోని వీధుల వెంట బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.