హుజూర్నగర్ రూరల్, జూన్ 17 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని బూరుగడ్డ గ్రామంలో గురువారం ఆయన ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. త్వరలో చేపట్టనున్న హరితహారం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పరశురాం, లాల్మదార్, సైదులు, నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
హుజూర్నగర్ : మండల రేషన్ డీలర్లు స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యేను రేషన్ డీలర్లు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు ధనమూర్తి, రాగం లింగయ్య, నాగేంద్రబాబు, మధు, రమేశ్, పాషా, కాశయ్య, విజయకుమారి, చంద్రకళ, నాగేశ్వర్రావు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.