కోదాడ రూరల్, మే 17 : కరోనా వైరస్ వ్యాప్తిపై ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ చింతా కవితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలను పరిశీలించారు. కరోనా నిర్ధారణ అయిన వారు మనోధైర్యంతో ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. డాక్టర్ సుధీర్చక్రవర్తి, పీహెచ్సీ తిరుపతయ్య, ఏఎన్ఎంలు భవాని, గోపమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
80మందికి కరోనా పరీక్షలు
ఆత్మకూర్.ఎస్ : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మండల వైద్యాధికారి డాక్టర్ ఆనంద్కుమార్ అన్నారు. సోమవారం స్థానిక పీహెచ్సీలో 80మందికి కరోనా పరీక్షలు చేయగా 15మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రంగమ్మ, శ్యాంకుమార్, భూపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
262 మందికి పరీక్షలు..
మునగాల/మోతె : మునగాల పీహెచ్సీలో 74 మందికి పరీక్షలు చేయగా 18మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డాక్టర్ రమేశ్ తెలిపారు. అలాగే రేపాల పీహెచ్సీలో 126మందికి చేయగా 16 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని డాక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. మోతె పీహెచ్సీలో 62మందికి పరీక్షలు చేసినట్లు డాక్టర్ నజియా తెలిపారు.
చిలుకూరులో 14మందికి పాజిటివ్
చిలుకూరు : స్థానిక పీహెచ్సీలో సోమవారం 125 మందికి కరోనా పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి ప్రమోద్కుమార్ తెలిపారు.